తాజా వార్త
నాగారంలో ఘనంగా తిరంగా ర్యాలీ.. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన
నాగారం:
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని
సీరినిట్ స్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని
ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా
ర్యాలీలో ముందుకు సాగారు. మూడు రంగుల జెండాలతో విద్యార్థులు
నిర్వహించిన ప్రదర్శన స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో
దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా
చాటారు. జాతీయ జెండాతో విద్యార్థులు క్రమశిక్షణతో ర్యాలీలో
పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు
పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందేశాన్ని ప్రజల్లోకి
తీసుకెళ్లారు.