దమ్మాయిగూడలో ఘనంగా తిరంగా ర్యాలీ
దమ్మాయిగూడ:
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మాయిగూడలో
జనసేన పార్టీ, VMR గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన
తిరంగా ర్యాలీ ఘనంగా, విజయవంతంగా జరిగింది.
విద్యార్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని
“వందే మాతరం”, “భారత్ మాతాకీ జై”, “జై హింద్”
అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
దీంతో దమ్మాయిగూడలో దేశభక్తి వాతావరణం నెలకొంది.
విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన
వాకిటి మల్లికార్జున రెడ్డి, వాకిటి సుజాత,
VMR గ్రామర్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు,
జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ
నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను
విద్యార్థుల్లో పెంపొందించేలా తిరంగా ర్యాలీ నిర్వహించడం
ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.