సీఎం రేవంత్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేకు పాలాభిషేకం
సింగీతం రిజర్వాయర్, నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులకు రూ.1.31 కోట్ల నిధుల మంజూరు
వార్త వివరాలు
మహమ్మద్నగర్, ఆగస్టు 29: జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్నగర్ మండల రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ మరమ్మతులకు రూ.83.50 లక్షలు, నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులకు రూ.48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కు ఆయకట్టు ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం మహమ్మద్నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్కు రూ.83.5 లక్షలు, నర్వ పాత చెరువు పంటకాలువకు రూ.48 లక్షలు కలిపి మొత్తం రూ.1.315 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహమ్మద్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.