పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు లింగంపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమం వివరాలు
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు లింగంపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా డా. BR అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని అన్నారు.
సుమారు ₹1,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్ను బకాయిలో ఉంచడం సరికాదని, దీనివల్ల విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఫీజుల బకాయిల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను కొనసాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు చేపడుతున్న రెండు రోజుల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు లింగంపేట మండల కేంద్రంలోని డా. BR అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన విద్యా హక్కును కాలరాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా మారుస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కదిలించి ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.