ఎస్ఐ పేరుతో
సైబర్ మోసం..
రూ.78,500 టోకరా!
ఎస్సైగా పరిచయం చేసుకొని వైన్స్ ఉద్యోగిని నమ్మించిన సైబర్ కేటుగాళ్లు రెండు రోజుల్లో రూ.78,500 నగదు కాజేసినట్లు సమాచారం.
అసలు ఏం జరిగింది?
మహబూబాబాద్: జిల్లాలోని నెల్లికుదురులో ఎస్సై పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ వైన్స్ ఉద్యోగి నుంచి రూ.78,500 కాజేసినట్లు సమాచారం.
కేసముద్రంకు చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసిన వ్యక్తి తాను ఎస్సైగా పరిచయం చేసుకున్నాడు. తన డ్రైవర్ రూ.25 వేలు నగదు ఇచ్చేందుకు వస్తున్నాడని, అందుకు బదులుగా క్యూఆర్ కోడ్కు డబ్బులు పంపాలని కోరినట్లు సమాచారం.
నమ్మిన బాధితుడు రెండు రోజుల్లో మొత్తం రూ.78,500 పంపినట్లు సమాచారం. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన అతను సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు.