చలో హైదరాబాద్
టీ ఎస్ సీ పీ ఎస్ ఈ యు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులంతా హైదరాబాద్లో భారీ కార్యక్రమానికి తరలివెళ్లారు
పెన్షన్ విధానంపై ఉద్యోగుల డిమాండ్
టీ ఎస్ సీ పీ ఎస్ ఈ యు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులంతా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల 60 వేలు గా ఉంది.
2004 తర్వాత ఎంపికైన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా లక్ష రూపాయలు జీతం తీసుకున్న ఉద్యోగికి నాలుగు లేదా ఐదు వేలు పెన్షన్ రావడం జరుగుతుంది.
అదే పాత పెన్షన్ అయితే 50% పెన్షన్ వస్తుంది. కావున హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరిగే మీటింగ్ కి భారీ సంఖ్యలో దాదాపు రెండు లక్షల ఉద్యోగులు రావచ్చని అంచనా.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలు పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు అయినా రాజస్థాన్, చతిస్గడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికల హామీలు కనుగుణంగా పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది.
కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.