కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఓటర్ల నమోదు మరియు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జారీ చేసిన నోటీసుల్లో ఓటర్ల పేర్లు, వయస్సు లేదా ఇతర వివరాల్లో ఏవైనా దోషాలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి అర్హుడూ జాబితాలో తమ సమాచారాన్ని స్వయంగా తనిఖీ చేసుకోవాలని, ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత మున్సిపల్ అధికారులను సంప్రదించి వెంటనే సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు
మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, వార్డ్ ఆఫీసర్ గంగారం, వార్డ్ కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ మౌనిక సోనీ తదితరులు పాల్గొన్నారు.