రాగం సుజాత యాదవ్కు అశ్రునివాళి.. శేరిలింగంపల్లిలో జనసంద్రంగా మారిన స్వగృహం
రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు
శ్రీమతి రాగం సుజాత యాదవ్ మృతి పట్ల శేరిలింగంపల్లి ప్రాంత ప్రజలు,
అభిమానులు, మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
ఆమె తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు,
అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
వర్టెక్స్ కింగ్స్టన్ స్వగృహానికి భారీగా ప్రజలు తరలివచ్చారు.
జనసంద్రంగా మారిన స్వగృహం
నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్టన్లో ఉన్న రాగం సుజాత యాదవ్ స్వగృహం
ప్రజలు, అభిమానులు, మహిళలు, యువత, కార్యకర్తలతో జనసంద్రంగా మారింది.
విచార వదనాలతో తరలివచ్చిన పలువురు కన్నీటి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,
ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, టీపీసీసీ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి
నివాళులు అర్పించారు.
యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్,
అఖిల భారత యాదవ సంఘం జనరల్ సెక్రటరీ ఆర్. లక్ష్మణ్ యాదవ్, మాజీ మేయర్
బొంతు రామ్మోహన్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రాజీవ్ సాగర్
తదితరులు కూడా నివాళులు అర్పించారు.
శేరిలింగంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్,
సీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శిరీష, ఇంజనీరింగ్ డిప్యూటీ ఇంజనీర్ ఆనంద్,
ఏఈ భాస్కర్, పోలీస్ అడిషనల్ డీసీపీ, ఏసీపీ, పలువురు మాజీ కార్పొరేటర్లు,
ప్రముఖులు, ముఖ్య నాయకులు పాల్గొని రాగం సుజాత యాదవ్కు ఘన నివాళులు
అర్పించారు.
బడుగు బలహీన వర్గాల కోసం విశేష సేవలు
రాగం సుజాత యాదవ్ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి,
మహిళా సాధికారతకు అంకితం చేశారని మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్,
బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
పేర్కొన్నారు.
సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా పనిచేసిన సమయంలో ఎంతోమంది పేద
విద్యార్థులు, మహిళల జీవితాల్లో వెలుగు నింపారని వారు పేర్కొన్నారు.
రాగం సుజాత యాదవ్ చేసిన సేవలు, కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని
తెలిపారు.
కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
అభిమాన నాయకురాలి మృతిపట్ల పలువురు అభిమానులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి,
ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు
మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రాగం సుజాత యాదవ్ ఆత్మకు
శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
