నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటి విడుదల
తాజా వార్త

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటి విడుదల

ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ

📅 02 సెప్టెంబర్ 2026 📍 జుక్కల్ నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా

నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల సాగుకు ప్రధాన కాలువ ద్వారా ఈరోజు నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు కలిసి సాగునీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కార్యక్రమం
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటి విడుదల

ఈ కార్యక్రమంలో బాన్సువాడ RDO శ్రీ రవీందర్ రెడ్డి, కామారెడ్డి DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. 2026 వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 36 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు.

నిజాంసాగర్‌లో 13.3 టీఎంసీల నీటి నిల్వ

ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో సుమారు 13.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నీటి నిల్వలపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో భాగంగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

నిజాంసాగర్ సాగునీటి విడుదల కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు
నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

చీఫ్ ఇంజనీర్ల కమిటీ, ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి వర్షాకాల పంటలకు నీటిని విడుదల చేస్తున్న మొదటి ప్రాజెక్టుగా నిజాంసాగర్ నిలుస్తోందని తెలిపారు.

1.30 లక్షల ఎకరాల ఆయకట్టు
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద సుమారు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.

15 రోజుల పాటు నీటి విడుదల

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొదట 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు పోచారం తెలిపారు. అనంతరం పరిస్థితిని బట్టి వారం లేదా పది రోజుల పాటు విరామం ఇచ్చి, మళ్లీ నీటిని విడుదల చేస్తూ చివరి పంట వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రస్తుతం నాలుగు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఎల్‌నినో ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రతి రైతు ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలన్న సూచన
ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు సాగునీటి ప్రణాళిక

పై, కింది ఆయకట్టు రైతులు సమన్వయంతో నీటిని వినియోగించాలి

పై ఆయకట్టు రైతులు ఎక్కువ నీటిని వినియోగిస్తే కింది ఆయకట్టు రైతులకు నీరు అందదని పోచారం పేర్కొన్నారు. అప్పుడు కాలువల్లో ఎక్కువ క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వస్తుందని, దీనివల్ల నిజాంసాగర్ నీటి నిల్వలు త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు.

కాబట్టి పై ఆయకట్టు, కింది ఆయకట్టు రైతులు పరస్పరం సహకరించుకుంటూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అందరూ సమన్వయంతో వ్యవహరిస్తే ప్రతి రైతు పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు నిజాంసాగర్ నీటిపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పోచారం తెలిపారు. రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన మేరకు నీటి సరఫరాను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుని, అధికారులు–రైతులు సమన్వయంతో పనిచేస్తే ఈ వర్షాకాల పంటలను కాపాడుకోవచ్చని పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.

© Pawar Vartha — తాజా తెలుగు వార్తలు
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
🕉️ పవార్ వార్త ప్రత్యేక వ్యాపార ప్రకటన
🕉️ PAWAR VARTHA SPECIAL BUSINESS ADVERTISEMENT
🪔 ఎల్లారెడ్డి నాణ్యత నమ్మకం

శ్రీ మణికంఠ పూజా సామాగ్రి

అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం

🕉️ అన్ని రకాల మాలధారణ సామాగ్రి
🪔 అయ్యప్ప పూజా సామాగ్రి
🌺 సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి
🙏 లక్ష్మీ వ్రత సామాగ్రి
🔥 అగరబత్తులు, లోబాన్
🌼 పసుపు, కుంకుమ
హారతి కర్పూరం
🪔 అన్ని రకాల పూజా వస్తువులు
✨ నాణ్యత 🙏 భక్తి సేవ 💰 సరసమైన ధరలు
🙏
పంతులు రామేశ్వర్రావు శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
🪔 Ellareddy Quality Trust

Sri Manikanta Pooja Samagri

Complete destination for Ayyappa pooja essentials

🕉️ All Ayyappa Mala Dharana items
🪔 Ayyappa Pooja Samagri
🌺 Satyanarayana Swamy Vratham items
🙏 Lakshmi Vratham items
🔥 Agarbatti and Loban
🌼 Turmeric and Kumkum
Harathi Camphor
🪔 All types of Pooja items
✨ Quality 🙏 Devotional Service 💰 Reasonable Prices
🙏
Panthulu Rameshwar Rao Sri Manikanta Pooja Samagri
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి ఎల్లారెడ్డి
🪔 పూజా సామాగ్రి
🪔 POOJA COLLECTION
📍 శ్రీ మణికంఠ పూజా సామాగ్రి – ఎల్లారెడ్డి అయ్యప్ప భక్తులకు కావాల్సిన సంపూర్ణ పూజా సామాగ్రి 📞 94924 20341    |    ☎️ 08465-228555
📍 Sri Manikanta Pooja Samagri – Ellareddy Complete pooja essentials for Ayyappa devotees 📞 94924 20341    |    ☎️ 08465-228555
Advertisement

Leave a Reply