షేకాపూర్లో ఘనంగా 676వ ఉర్సు వేడుకలు
హజ్రత్ షేక్ షహాబుద్దీన్ షహీద్ దర్గాను సందర్శించిన మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్.. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ
జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ గ్రామంలో హజ్రత్ షేక్ షహాబుద్దీన్ షహీద్ 676వ ఉర్స్-ఏ-షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ హాజరై దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు.
వార్తకు ప్రతీకాత్మకంగా ఉపయోగించిన ఆన్లైన్ దర్గా చిత్రం.
ఉర్స్-ఏ-షరీఫ్ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత, శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని డా. ఏ. చంద్రశేఖర్ పేర్కొన్నారు.
గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, అధిక నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి దర్గాను సందర్శించి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా నిర్వాహకులు, మత పెద్దలు, భక్తులతో మాట్లాడారు.