విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నేతలు
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి
స్వాగతం పలికిన మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి
తెలంగాణ రాష్ట్ర ఎంపీల పోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి గారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి డాక్టర్ మల్లు రవి గారు అభినందనలు తెలియజేశారు.