పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” పేరుతో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం
విద్యార్థులకు గత కొన్ని విద్యా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నిరసన కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారు చేపడుతున్న 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
“ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” పేరుతో మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజుల వ్యాఖ్యలు
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
ప్రభుత్వానికి, కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని అన్నారు.