కీసర పరిధిలో
149 సీసీ కెమెరాలు
ప్రారంభం
నేరాల నియంత్రణకు ‘నేను సైతం 2.0’
ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచేందుకు కీసర పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
📸 కార్యక్రమ దృశ్యాలు
కీసర, ఆగస్టు 24: ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచేందుకు కీసర పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి పి. సుమతి, IPS ఆధ్వర్యంలో ‘నేను సైతం 2.0–మీ రక్షణ’ కార్యక్రమంలో భాగంగా ఈ సీసీ కెమెరాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని గోధుమకుంటలో 20, చేర్యాల విలేజ్లో 5, డీఎస్ఆర్ ఎంక్లేవ్లో 20, లక్ష్మీనగర్లో 15, ఆర్జీకే డబుల్ బెడ్రూమ్ బండ్లగూడలో 18, ఎస్వీ నగర్లో 28 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మొత్తంగా కీసర పరిధిలో 149 సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కీసర పోలీస్స్టేషన్ పరిధి సుమారు 17 చదరపు కిలోమీటర్లు ఉండగా, సుమారు 3–4 లక్షల జనాభా నివసిస్తోంది.
మొత్తం 158 కాలనీలు పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. సమర్థవంతమైన పోలీసింగ్ కోసం ఈ ప్రాంతాన్ని 5 సెక్టార్లుగా విభజించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు.
కాలనీలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో కెమెరాల ఏర్పాటు ద్వారా పోలీసులకు మరింత సమర్థవంతమైన నిఘా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ పి. సుమతి IPS, ఏసీపీ చక్రపాణి, ట్రాఫిక్ ఏసీపీ సుబ్బయ్య, డీసీపీ శ్రీధర్, సీఐ ఆంజనేయులు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.