ఉద్యమకారుడు మురుగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సాయినగర్ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు భారీగా ర్యాలీగా మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ నాయకులు స్వాగతం పలికారు.

కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.