ఒడిశా నుంచి తెలంగాణకు హషీష్ ఆయిల్.. ఇద్దరి అరెస్ట్
ఘటనకు సంబంధించిన వీడియో
ఎక్కడ పట్టుకున్నారు?
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. యమహా MT-15 బైక్పై హషీష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వ్యక్తులు
వీరిద్దరూ పెడ్లర్ కమ్ ట్రాన్స్పోర్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్నవి
విచారణలో కీలక విషయాలు
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన తమరా గోపాల్ అనే వ్యక్తి నాగరాజు, నారాయణలకు చెరో 7 కిలోల హషీష్ ఆయిల్ ఉన్న రెండు బ్యాగులను అందించినట్లు పోలీసులు తెలిపారు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలించి అప్పగిస్తే ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇస్తానని గోపాల్ ఆఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సరఫరా నెట్వర్క్
పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు గ్రామీణ రహదారుల మీదుగా హైదరాబాద్ వైపు వస్తుండగా నిందితులు పట్టుబడ్డారు.
ప్రధాన సరఫరాదారు
7 కిలోలు
7 కిలోలు
ప్రధాన సరఫరాదారు పరారీ
నిందితులు గతంలో కూడా గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన సరఫరాదారు తమరా గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
ఈ ఘటనపై నాగోల్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి.. హషీష్ ఆయిల్ సరఫరా వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.