బొల్లారం వద్ద
అక్రమ ఆయుధాలు
పట్టివేత
నిందితుడి అరెస్ట్
అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు, బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పర్భాన్స్ కుమార్ అక్రమంగా డ్రై గంజాయి, గంజాయి చాక్లెట్ల విక్రయానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2024లో చెర్లపల్లి పోలీసులు అతడిని గంజాయి కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అనంతరం తుపాకులు, తపంచాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరలకు విక్రయించాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న ఉత్తరప్రదేశ్కు వెళ్లి సోను అనే వ్యక్తి నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ఆగస్టు 22న మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో బొల్లారం బంగ్లా నంబర్ 13, సాధన మందిర్ సమీపంలో పర్భాన్స్ కుమార్ కదులుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు, బొల్లారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పర్భాన్స్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు.