తెలంగాణ కాంగ్రెస్
భట్టి విక్రమార్కకు కల్తి వెంకట్ అభినందనలు.. ప్రజాభవన్లో మర్యాదపూర్వక భేటీ
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఉప ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ యువనేత
హైదరాబాద్:
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్కను రాష్ట్ర కాంగ్రెస్ యువనేత కల్తి వెంకట్
మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను
బేగంపేటలోని ప్రజాభవన్లో కలిసిన కల్తి వెంకట్, ఆయన పర్యటన విజయవంతంగా ముగించుకుని
రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజా సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత
విజయవంతం కావాలని ఈ సందర్భంగా కల్తి వెంకట్ ఆకాంక్షించారు.
విజయవంతం కావాలని ఈ సందర్భంగా కల్తి వెంకట్ ఆకాంక్షించారు.
ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై
పరస్పరం చర్చ జరిగినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా కల్తి వెంకట్
తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
