పీర్జాదిగూడలో ఘనంగా హర్ ఘర్ తిరంగా అభియాన్.. దేశభక్తి స్ఫూర్తిని చాటిన బీజేపీ నాయకులు
పీర్జాదిగూడ డివిజన్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన
హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి
ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
ప్రతి భారతీయుడిలో దేశభక్తి స్ఫూర్తిని నింపే గొప్ప కార్యక్రమమని అన్నారు.
జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను
స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశం పట్ల గౌరవాన్ని చాటేలా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు.
“తిరంగా మన గర్వం.. భారత్ మన సంకల్పం” అనే సందేశాన్ని
ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సుదర్శన్ రెడ్డి అన్నారు.
దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు
బాధ్యతగా దేశభక్తిని చాటాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి,
జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు కరుణాకర్ రెడ్డి,
మేడిపల్లి డివిజన్ అధ్యక్షుడు జమ్ముల ప్రభాకర్ రెడ్డి,
బీజేవైఎం మాజీ అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి,
ఉపాధ్యక్షులు చామల సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్ గుప్తా, స్వరూప్ చంద్ర,
మహిళా నాయకురాలు గీతారామ్, డివిజన్ కన్వీనర్
మాధవి లత, నవ్య తదితరులు పాల్గొన్నారు.
