కాప్రా చెరువు వద్ద ఘనంగా కార్కిడక వావుబలి
హైదరాబాద్, ఆగస్టు 12:
మలయాళీ సమాజం తమ పూర్వీకులను స్మరించుకుంటూ నిర్వహించే పవిత్రమైన
కార్కిడక వావుబలి – పితృ తర్పణ కార్యక్రమం కాప్రా చెరువు
ఒడ్డున భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
రామ ధర్మ ప్రచార సభ – భాగ్యనగర్ ఆధ్వర్యంలో బుధవారం
(ఆగస్టు 12, 2026) నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు
హాజరై తమ పూర్వీకులను స్మరించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే పితృ తర్పణ
కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
పూర్వీకుల స్మరణలో పితృ తర్పణం
మరణించిన తాతలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పిల్లలు,
ఇతర బంధువులను స్మరించుకుంటూ భక్తులు పిండప్రదానం, తర్పణం, ప్రత్యేక
పూజలు నిర్వహించారు. పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భక్తులు
ప్రార్థనలు చేశారు.
పాల్గొన్నారని రామ ధర్మ ప్రచార సభ – భాగ్యనగర్ అధ్యక్షులు రామచంద్రన్ తెలిపారు.
ఆన్లైన్ స్లాట్ బుకింగ్తో ఏర్పాట్లు
కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు భక్తులు ముందుగానే
ఆన్లైన్లో తమ స్లాట్లను బుక్ చేసుకునే విధంగా
ఏర్పాట్లు చేసినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి అనిల్ తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు
చేశారు.
తర్పణ సామగ్రి నిర్వాహకులే అందజేత
పితృ తర్పణ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు ప్రత్యేకంగా ఎలాంటి
సామగ్రిని తమ వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని సంస్థ ఎగ్జిక్యూటివ్
మెంబర్ జయకుమార్ తెలిపారు. తర్పణానికి అవసరమైన అన్ని సామగ్రిని
రామ ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలోనే కార్యక్రమ ప్రాంగణంలో
అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
పూర్వీకులను స్మరించుకోవడం, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, వారి ఆత్మలకు
శాంతి కలగాలని ప్రార్థించడం భారతీయ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన
ఆచారమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పితృ తర్పణ కార్యక్రమం ద్వారా మలయాళీ
సమాజం తమ ఆచారాలు, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తూ,
పూర్వీకుల పట్ల తమ భక్తి, గౌరవాన్ని చాటుకుంటోందని తెలిపారు.
పితృ తర్పణం.. తరతరాలకు అందించే సంస్కృతి వారసత్వం.”

