స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కథనం
మయూరి నగర్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
జాతీయ జెండాను ఆవిష్కరించిన వి. జగదీశ్వర్ గౌడ్
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ మయూరి నగర్ డివిజన్లో
జాతీయ భావాన్ని చాటేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మయూరి నగర్ డివిజన్లో నాయకులు మన్నేపల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం దేశ ప్రజలకు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, కోట్లాది భారతీయుల ఆశలు మరియు
ఆకాంక్షలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన
మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.”
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని,
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత
నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక
ప్రజలు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
యాదగిరి గౌడ్, సయ్యద్ గౌస్, అమరేందర్, సునీల్, కావూరి ప్రసాద్,
సఫారీ సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, కోటారి వెంకట్, రాజేంద్ర ప్రసాద్,
అశోక్ గౌడ్, రవి గౌడ్, బాబ్జి రాజు, రామచందర్ గౌడ్, కృష్ణ గౌడ్,
బండారు శ్రీనివాస ముదిరాజ్, మన్నె విజయ్, దొడ్డ సాంబశివరావు,
రామకృష్ణ, మన్నే నరేందర్, శంకర్ గౌడ్, అంకనపల్లి శివశంకర్,
లింగమనేని సాంబశివరావు, రాంబాబు, మన్నేపల్లి శివ, పట్టాభి రామయ్య,
బిందు, గణేష్, ప్రసాద్, సందీప్, బాబా, సాంబయ్య, విశ్వనాథం
తదితరులు పాల్గొన్నారు.
డివిజన్: మయూరి నగర్
ప్రాంతం: మియాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం
🇮🇳 జై హింద్ 🇮🇳
