రాంపల్లి DSR కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారం వార్డ్ పరిధిలోని రాంపల్లి DSR కాలనీలో
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో
జలమండలి మేనేజర్ సాయి కిరణ్ గౌడ్ జాతీయ పతాకాన్ని
ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి,
కాలనీ వాసులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను
త్యాగం చేసిన అమరవీరులు, మహనీయుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి
బాధ్యత అని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు
పీలుస్తున్నామని పేర్కొన్నారు.
చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. ప్రతి నీటి చుక్కను
కాపాడుకోవాలి.”
నీటి సంరక్షణపై కాలనీ వాసులకు ఆయన ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
వర్షపు నీటిని వృథాగా బయటకు వెళ్లనివ్వకుండా భూమిలోకి ఇంకించేలా
ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తితో పాటు పర్యావరణం,
నీటి సంరక్షణపై అవగాహన కల్పించేలా ఇచ్చిన ఈ సందేశం కాలనీ వాసులను
ఆకట్టుకుంది.
