జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని
జీడిమెట్ల సర్కిల్ గణేష్ నగర్లో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా
హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కూన శ్రీశైలం గౌడ్ జాతీయ జెండాకు
వందనం చేసి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం
సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని
గుర్తు చేశారు. వారి త్యాగాలు, ధైర్యసాహసాలు దేశ చరిత్రలో ఎప్పటికీ
చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, హక్కులు ఒక్కరోజులో వచ్చినవి కావని,
వాటి వెనుక అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉందని పేర్కొన్నారు.
వారి పోరాట స్ఫూర్తిని నేటి తరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వం, సోదరభావం,
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత.”
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను
నిర్వర్తించాలని కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ
భేదాలకు అతీతంగా భారతీయులుగా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవం వంటి సందర్భాలు దేశం కోసం పోరాడిన మహనీయులను
స్మరించుకోవడంతో పాటు, దేశ భవిష్యత్తు కోసం మన బాధ్యతలను గుర్తుచేసే
సందర్భాలని ఆయన పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, దుర్గ రావు, లింగం యాదవ్,
వెంకటేశ్ యాదవ్, నరసింహ రెడ్డి, భాస్కర్ గౌడ్, గణేష్, యాదగిరి, మురళి
తదితరులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
