దేవస్థానం భూముల పరిరక్షణకు అఖిలపక్షాల ఐక్యగళం
14 ఎకరాల 10 గుంటల భూమికి హద్దులు నిర్ణయించి ఎండోమెంట్స్ శాఖకు స్వాధీనం చేయాలని డిమాండ్
దేవాలయ భూముల రక్షణకు సంతకాల సేకరణ
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములను పరిరక్షించేందుకు దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానానికి సంబంధించిన భూములను కాపాడటంతో పాటు వాటిని అధికారికంగా దేవస్థానం ఆధీనంలోకి తీసుకురావాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టారు.
దేవస్థానం పరిధిలో సుమారు 40 ఎకరాల భూమి ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ భూమిలోని 14 ఎకరాల 10 గుంటల భూమిని ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖకు రాసి ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
ఎండోమెంట్స్ శాఖకు కేటాయించిన ఈ భూమికి స్పష్టమైన హద్దులను నిర్ణయించి, అధికారికంగా శాఖకు స్వాధీనం చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రతినిధులు కలిసి పాల్గొనడంతో అఖిలపక్షాల భాగస్వామ్యం కనిపించింది. అందరి సహకారంతో సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు.