రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో, యువతకు అవకాశాలు కల్పించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో, యువతకు అవకాశాలు కల్పించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలు, దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.