బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఆలయ కమిటీ ఆహ్వానం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో
నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు విచ్చేసి పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఆలయ కమిటీ సభ్యులు బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేసి,
ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ,
రానున్న ఆదివారం జరిగే బోనాల మహోత్సవాలకు తప్పకుండా హాజరై అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో,
వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంప్రదాయబద్ధంగా నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నాను.”
– ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్
పద్మ శ్రీకాంత్,
పాండ్రే వినోద్,
పప్పు వెంకటేశం,
ప్యాలాల రాములు,
మంచిర్యాల విద్యాసాగర్,
గాదె తిరుపతి,
భక్తులు, స్థానిక ప్రముఖులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.