భార్యపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు… భర్తపై హత్యాయత్నం కేసు?
ముస్తాపూర్ గ్రామంలో ఘటన • తీవ్రంగా గాయపడిన మహిళను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలింపు
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముస్తాపూర్ గ్రామంలో ఓ మహిళపై ఆమె భర్త కత్తితో దాడికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ముస్తాపూర్ గ్రామానికి చెందిన మౌనికను శెట్టుపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బహుగుణ చారికి వివాహం చేసినట్లు సమాచారం.
వివాహం అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో మౌనిక ఇటీవల తన పుట్టింటికి ముస్తాపూర్ గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది.
భార్యను తిరిగి తీసుకువెళతానని చెప్పి చారి గ్రామానికి వచ్చి, ఈ ఘటనకు పాల్పడినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
దాడిలో మౌనిక తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలించినట్లు తెలిపారు.