వెలుట్లపేటలో పేదల సొంతింటి కల సాకారం
15 ఇళ్లు ఇప్పటికే మంజూరు.. రెండో విడతలో మరో 4 ఇళ్లకు అనుమతి.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు
వెలుట్లపేటకు ఇందిరమ్మ ఇళ్ల వరం
వెలుట్లపేట: పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం వెలుట్లపేట గ్రామంలో అర్హులైన కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది.
గ్రామానికి ఇప్పటివరకు 15 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండో విడతలో భాగంగా తాజాగా మరో 4 ఇళ్లు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొయ్యల రాజా గౌడ్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు.
గ్రామానికి ఇప్పటివరకు 15 ఇళ్లు రావడం, తాజాగా రెండో విడతలో మరో 4 ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత చొరవ చూపాలని కోరారు.
ఇప్పటికే మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా నిర్మించుకునేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఇంకా ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు కూడా రాబోయే విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
— కొయ్యల రాజా గౌడ్